Nalgonda : నల్లగొండలో 160 ఎకరాల భూమి కబ్జా..

Nalgonda : నల్లగొండలో 160 ఎకరాల భూమి కబ్జా..
Nalgonda : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ భూ కుంభకోణానికి తెరతీశారు

Miryalaguda : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ భూ కుంభకోణానికి తెరతీశారు. స్వయంగా ఓ ప్రభుత్వ అధికారే.. ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఈ భూకుంభకోణం వెనక చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారి సహాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి, ఏకంగా 160 ఎకరాల ప్రభుత్వ భూమిని బడా కంపెనీకి అప్పగించేందుకు ప్లాన్ చేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సదరు ఫైల్‌ను వెనక్కి పంపడంతో.. మిర్యాలగూడలో జరిగిన భూబాగోతం వెలుగులోకి వచ్చింది.

అవినీతి అధికారికి టీఆర్‌ఎస్‌కు చెందిన కీలకనేత అండదండలు ఉండడంతో.. ల్యాండ్‌ డీల్‌ కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టడం కోసం మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. మిర్యాలగూడ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. లేదంటే ఆందోళన చేసేందుకు సిద్ధమని ప్రకటించాయి.

Tags

Read MoreRead Less
Next Story