ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు!

ఏపీలో నిన్న తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఈ రోజు మళ్ళీ పెరిగాయి.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,099 కరోనా పరీక్షలు చేయగా, 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,245కు చేరింది. ఇందులో 1,660 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 8,77,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు చనిపోగా, ఏపీలో మొత్తం 7,142 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,26,43,313 శాంపిల్స్ పరీక్షించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
#COVIDUpdates: 19/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 19, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,350 పాజిటివ్ కేసు లకు గాను
*8,74,548 మంది డిశ్చార్జ్ కాగా
*7,142 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,660#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LZwPPLPTHs
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com