తెలంగాణలో 24 గంటల్లో 2123 పాజిటివ్ కేసులు
By - kasi |19 Sep 2020 4:09 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2123 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 305 కేసులు నమోదయినట్టు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్ జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి మరణించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 69వేల 169 కేసులకు చేరగా... వీరిలో లక్షా 37వేల 508 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com