Jangaon: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

Jangaon: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
Jangaon: జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.

Jangaon: జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పంక్షన్‌కు హాజరవడానికి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తవేరా కారులో వరంగల్‌

నుండి హైదరాబాద్‌ వెళుతుండగా.. టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు వరంగల్‌ చింతల్‌ నగర్‌కు చెందిన అఫ్రీన్‌ బేగం, ఫర్జాబ్‌ బేగం, షౌకత్‌ హుస్సేన్‌గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story