కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

X
By - Subba Reddy |16 April 2023 8:45 AM IST
సాయినగర్కాలనీలో ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు
హైదరాబాద్ కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినగర్కాలనీలో ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మృతులు ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ అగ్నిప్రమాదం సంభవించగా..క్షణాల్లోనే మంటలు పక్క భవనంలోకి వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com