ఓఆర్ఆర్పై యాక్సిడెంట్.. వేగంగా ప్రయాణిస్తున్న కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో..
అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి స్తంభానికి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టీఎస్ 12ఈకే 0298 నంబర్ గల మారుతీ స్విప్ట్ కారు ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళుతున్నది. ఈ క్రమంలో రాజేంద్రనగర్లోని హిమాయత్ సాగర్ సమీపంలో అదుపుతప్పి డివైడర్ మధ్యనున్న స్తంభాన్ని ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, మితిమీరిన వేగం ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణగండం తప్పిందని వెల్లడించారు. గాయపడిన వారంతా హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com