తెలంగాణలో కొత్తగా 6,206 కేసులు.. 29 మరణాలు

తెలంగాణలో కొత్తగా 6,206 కేసులు.. 29 మరణాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6 వేల 206 కేసులు.. 29 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 79వేల 494కి చేరింది.

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6 వేల 206 కేసులు.. 29 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 79వేల 494కి చేరింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1928కు పెరిగాయి. ప్రస్తుతం 52 వేల 726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1005, మేడ్చల్ జిల్లా 502, నిజామాబాద్ జిల్లా 406, రంగారెడ్డి 373, మహబూబ్ నగర్ 271, మంచిర్యాల జిల్లా 226, సిద్దిపేట 215, కరీంనగర్ 197, నాగర్ కర్నూలు 196, జగిత్యాల జిల్లాలో 188 కరోనా కేసులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story