700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న భట్టి పాదయాత్ర
By - Subba Reddy |12 May 2023 11:30 AM GMT
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా రామానుజాపూర్ వద్ద పార్టీ నేతలు, కార్య కర్తల మధ్య కేక్ కట్ చేశారు భట్టి విక్రమార్క. అదేవిధంగా శంషాబాద్ మండలంలో ముగిసిన భట్టి విక్రమార్క పాదయాత్ర.. షాబాద్ మండలంలోకి ప్రవేశించింది. దీంతో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా రైతులు, వ్యాపారుల దగ్గరి వెళ్తున్న భట్టి విక్రమార్క స్వయంగా వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com