8న హైదరాబాద్కు రానున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 8న ప్రియాంక హైదరాబాద్ రానున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ తలపెట్టిన నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. తొలుత ఈనెల 8న ముగియనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తూ ఆమె హైదరాబాద్కు వస్తారు. వాస్తవానికి ఈనెల 5 లేదా 6న ప్రియాంక గాంధీ హైదరాబాద్లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ నిరుద్యోగ సభ వాయిదా పడింది. అటు ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న వేళ నిరుద్యోగ నిరసన సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com