తెలంగాణ‌లో కొత్తగా 8,061 కరోనా కేసులు.. 56మంది మృతి.. !

తెలంగాణ‌లో కొత్తగా 8,061 కరోనా కేసులు.. 56మంది మృతి.. !
తెలంగాణలో కరోనా కల్లోల్లం సృష్టిస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 99,638 కరోనా టెస్టులు చేయగా... 8,061 కరోనా కేసులు బయటపడ్డాయి.

తెలంగాణలో కరోనా కల్లోల్లం సృష్టిస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 99,638 కరోనా టెస్టులు చేయగా... 8,061 కరోనా కేసులు బయటపడ్డాయి.. కొత్తగా 56 మంది మరణించారు. అయితే నిన్నటి పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ.. మరణాల సంఖ్య పెరిగింది. అటు కరోనా నుంచి కొత్తగా 6,446 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,221 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story