Telangana : యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అధికారులు అందించిన సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ పథకానికి 9.5 లక్షల మందికి పైగా దరఖాస్తులు అందాయని సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 14న గడువు తేదీగా నిర్ణయించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేస్తున్నారు. 2016 తరువాత జారీ చేసిన కుల ధ్రువపత్రాలు సరిపోతాయని అధికారులు స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రం లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ రెండు ధ్రువపత్రాలు లేని వారు తప్పనిసరిగా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com