Hyderabad : ఆస్తి కోసం భార్యతో యాసిడ్‌ తాగించిన కసాయి భర్త

Hyderabad :  ఆస్తి కోసం భార్యతో యాసిడ్‌ తాగించిన కసాయి భర్త
Hyderabad : ఆస్తుల కోసం కిరాతకానికి ఒడిగట్టాడు.. కట్టుకున్న భార్యకే యాసిడ్‌ తాగించాడు.. విషయం బయటకు పొక్కకుండా వివస్త్రను చేసి నిర్బంధించాడు.

Hyderabad : ఆస్తుల కోసం కిరాతకానికి ఒడిగట్టాడు.. కట్టుకున్న భార్యకే యాసిడ్‌ తాగించాడు.. విషయం బయటకు పొక్కకుండా వివస్త్రను చేసి నిర్బంధించాడు.. కిరాతక భర్త నుంచి తప్పించుకోవడంతో ప్రాణాలు దక్కాయి.. సకాలంలో వైద్యం అందటంతో బతికి బట్టకట్టింది ఆ ఇల్లాలు.. ఈ క్రూర ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

తన భర్త నుంచి తన్ను కాపాడండి అంటూ బోడ పద్మ అనేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. బోడ పద్మ భర్త కొర్ర ధర్మానాయక్‌.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2008 ఏసీబీ ఆస్తులను అటాచ్‌ చేసింది.

ఈ నేపథ్యంలోనే భార్య పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపైకి మార్చాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. భార్యతో బలవంతంగా బ్యాంక్‌ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోదని.. మీడియాను ఆశ్రయించింది బాధితురాలు.

Tags

Read MoreRead Less
Next Story