Hyderabad : బిర్యానీ కోసం గొడవ.. హోంమంత్రికి అర్థరాత్రి ఫోన్..

X
By - Sai Gnan |29 Sept 2022 6:24 PM IST
Hyderabad : హైదరాబాద్ పాతబస్తీ నుంచి ఓ యువకుడు అర్థరాత్రి హోంమంత్రికి ఫోన్ చేశాడు
Hyderabad : హైదరాబాద్ పాతబస్తీ నుంచి ఓ యువకుడు అర్థరాత్రి హోంమంత్రికి ఫోన్ చేశాడు. నగరంలో బిర్యాని హోటళ్లు ఎప్పటి వరకు తెరిచి ఉంచాలో చెప్పాలని రిక్వెస్ట్ చేశారు. అర్థరాత్రి ఫోన్ చేసి హోటళ్లు గురుంచి ఆరా తీయడంతో హోంమంత్రి మహమూద్అలీ అసహనం వ్యక్తం చేశాడు. తాను హోంమంత్రినని వంద టెన్షన్లు ఉంటాయని ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకే హోటల్స్ మూసివేస్తారని మహమూద్ అలీ తెలిపారు.ఇదిలా ఉండగా అర్థరాత్రి వరకు బిర్యానీ విక్రయాల అనుమతి కోసం ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. ఈమేరకు హైదరాబాద్ సీపీని కూడా కలిసి అర్థరాత్రి విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com