TG: ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధం

TG: ప్రైవేట్ బస్సులపై చర్యలకు  సిద్ధం
X
నేటి నుంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్న అధికారులు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.

"సమగ్ర విచారణకు ఆదేశించాం"

కర్నూ­ల్ జి­ల్లా­‌­లో జరి­గిన బస్సు ప్ర­మాద ఘటన తనను తీ­వ్ర ద్రి­గ్భ్రాం­తి­కి గురి చే­సిం­ద­ని మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్ అన్నా­రు. బస్సు ప్ర­మా­దం­లో ప్రా­ణా­లు కో­ల్పో­యిన మృ­తు­ల­కు సం­తా­పం వ్య­క్తం చే­స్తు­న్నా­న­ని అన్నా­రు. తె­లం­గాణ ప్ర­భు­త్వం నుం­చి తీ­సు­కో­వా­ల్సిన చర్య­ల­పై రవా­ణా­‌­శా­ఖ­కు ఆదే­శా­లు జారీ చే­శా­మ­న్నా­రు. ఏపీ రవా­ణా శాఖ మం­త్రి మం­డి­ప­ల్లి రాం­ప్ర­సా­ద్ రె­డ్డి­తో పాటు, కర్నూ­లు జి­ల్లా కలె­క్ట­ర్ సిరి, ఎస్పీ వి­క్రాం­త్ పా­టి­ల్‌­తో ఫో­న్‌ మా­ట్లా­డి వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­మ­న్నా­రు. ఏపీ, కర్ణా­టక, తె­లం­గాణ రా­ష్ట్రాల మధ్య ప్ర­తి­రో­జు వే­లా­ది మంది ప్ర­యా­ణం చే­స్తుం­టా­ర­ని.. భవి­ష్య­త్తు­లో ఇలాం­టి ఘట­న­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా అన్ని రకాల చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. త్వ­ర­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్, కర్ణా­టక, తె­లం­గాణ రవా­ణా శాఖ మం­త్రు­లు, రవా­ణా శాఖ కమి­ష­న­ర్ల సమా­వే­శం ఏర్పా­టు చే­స్తా­మ­ని అన్నా­రు.

తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల పరిహారం

కర్నూ­లు బస్సు ప్ర­మాద మృ­తుల కు­టుం­బా­ల­కు తె­లం­గాణ ప్ర­భు­త్వం ఎక్స్‌­గ్రే­షి­యా ప్ర­క­టిం­చిం­ది. మృ­తుల కు­టుం­బా­ల­కు రూ.5 లక్ష­లు, క్ష­త­గా­త్రు­ల­కు రూ. 2 లక్ష­లు అం­దిం­చ­ను­న్న­ట్టు రవా­ణా శాఖ మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్ ప్ర­క­టిం­చా­రు. అయి­తే, తె­లం­గాణ వా­సు­ల­కే ఈ పరి­హా­రం వర్తి­స్తుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ఇప్ప­టి­కే బస్సు­లో మృ­త­దే­హాల వె­లి­కి­తీత ప్ర­క్రియ పూ­ర్త­య్యిం­ది. ప్ర­మా­దం­లో మె­ు­త్తం 19 మంది మృతి చెం­ద­గా.. 23 మంది ప్రా­ణా­ల­తో బయ­ట­ప­డ్డా­రు. ప్ర­మా­దం­పై ప్ర­భు­త్వం తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­సిం­ది.

మాటలు రావటం లేదు: మోహన్‌బాబు

హై­ద­రా­బా­ద్-బెం­గ­ళూ­రు హై­వే­పై జరి­గిన బస్సు దు­ర్ఘ­ట­న­పై నటు­డు మో­హ­న్ బాబు ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. ' ప్ర­మాద తీ­వ్రత చూసి మా­ట­లు రా­వ­టం లేదు. క్ష­ణా­ల్లో చాలా మంది ప్రా­ణా­లు కో­ల్పో­యి, సజీ­వ­ద­హ­నం కా­వ­టం బా­ధా­క­రం. మృ­తుల కు­టుం­బా­ల­కు నా ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­జే­స్తు­న్నా. గా­య­ప­డి­న­వా­రు త్వ­ర­గా కో­లు­కో­వా­ల­ని, దుః­ఖం­లో ఉన్న వా­రం­ద­రి­కీ దే­వు­డు బలా­న్ని ప్ర­సా­దిం­చా­ల­ని కో­రు­కుం­టు­న్నా' అని ట్వీ­ట్ చే­శా­రు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Next Story