Adani Row: సమాధానం కావాలి... కవిత ట్వీట్...
By - Chitralekha |28 Jan 2023 11:19 AM GMT
ప్రముఖ వాణిజ్య సంస్థ ఆదానీ గ్రూప్పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్; ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో.. తగ్గుదల ఆందోళన కల్గిస్తున్నాయి అంటోన్న కవిత; ప్రతి భారతీయుడికి కేంద్రం సమాధానం చెప్పాలి...
ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా ఆందోళన కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ప్రతి భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్, దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఆర్థికంగా నష్టపోయిన పెట్టుబడిదారులతో ప్రభుత్వం తరపున మాట్లాడాలని కోరుతున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com