WARNGAL: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కయ్యం

WARNGAL: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కయ్యం
X
కొండా మురళీ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం... రంగంలోకి దిగిన మంత్రి కొండా సురేఖ

తె­లం­గా­ణ­లో వరం­గ­ల్‌ జి­ల్లా కాం­గ్రె­స్‌ పా­ర్టీ నా­య­కుల కయ్యం తీ­వ్ర­మ­వు­తోం­ది. కొం­డా ము­ర­ళీ వ్యా­ఖ్య­ల­తో రా­జు­కు­న్న వి­వా­దం­లో ఇప్పు­డు అతడి భా­ర్య కొం­డా సు­రేఖ రం­గం­లో­కి ది­గా­రు. కడి­యం శ్రీ­హ­రి, నా­యి­నీ రా­జేం­ద­ర్‌ రె­డ్డి­పై కొం­డా సు­రేఖ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. కడి­యం శ్రీ­హ­రి నల్లి­కు­ట్లో­డు అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. భద్ర­కా­ళి ఆలయం ఎవరి సొ­త్తు కా­ద­ని నా­యి­నీ రా­జేం­ద­ర్‌ రె­డ్డి­కి కొం­డా సు­రేఖ వా­ర్నిం­గ్‌ ఇచ్చా­రు. కడి­యం శ్రీ­హ­రి, నా­యి­నీ రా­జేం­ద­ర్‌ రె­డ్డి వ్యా­ఖ్య­ల­పై శు­క్ర­వా­రం మం­త్రి కొం­డా సు­రేఖ మీ­డి­యా­తో ఇష్టా­గో­ష్టి­గా మా­ట్లా­డా­రు. 'నే­ను మం­త్రి­గా ఉంటే నా ముం­దు కూ­ర్చో­వ­డా­ని­కి కడి­యం శ్రీ­హ­రి నా­మో­షీ­గా ఫీల్ అవు­తు­న్నా­డు. అం­దు­కే నా మం­త్రి పదవి పో­తుం­దం­టూ తప్పు­డు ప్ర­చా­రం చే­యి­స్తు­న్నా­డు. సీఎం దగ్గ­ర­కు, పొం­గు­లే­టి వద్ద­కు వె­ళ్లి నా మీద ఉన్న­ది లే­ని­ది చె­బు­తు­న్నా­డు' అని తె­లి­పా­రు. తె­లు­గు దే­శం­లో నడి­పిం­చు­కు­న్న­ట్లు ఇక్కడ కూడా నడి­పిం­చా­ల­ని అను­కుం­టు­న్నా­డ­ని ఆరో­పిం­చా­రు. 'నా అదృ­ష్టం ఉంది నేను మం­త్రి అయ్యా. ఆయ­న­కు అదృ­ష్టం ఉన్న­ప్పు­డు ఆయన కూడా మం­త్రి అయ్యా­డు. నన్ను, నా కూ­తు­రు ది­గి­పో­వా­ల­ని అను­కుం­టే ఎలా?' అని కొం­డా సు­రేఖ ప్ర­శ్నిం­చా­రు. 'నా కూ­తు­రి­కి అదృ­ష్టం లేదు ఎమ్మె­ల్యే కా­లే­దు. కడి­యం కూ­తు­రి­కి అదృ­ష్టం ఉంది ఎంపీ అయ్యిం­ది. నేను ఆమె ఎంపీ పదవి తీ­యా­ల­ని అం­టు­న్నా­నా?' అని సు­రేఖ పే­ర్కొ­న్నా­రు. భద్ర­కా­ళి ఆల­యం­లో బో­నా­ల­పై ఎమ్మె­ల్యే నా­యి­ని చే­సిన వ్యా­ఖ్య­ల­కు సు­రేఖ కౌం­ట­ర్ ఇచ్చా­రు.

కొండాపై కాంగ్రెస్ అసంతృప్తి

కాం­గ్రె­స్ అధి­ష్ఠా­నం.. కొం­డా సు­రే­ఖ­పై అసం­తృ­ప్తి­తో ఉన్న­ట్లు వా­ర్త­లు వచ్చా­యి. ఆమె­తో కాం­గ్రె­సు పా­ర్టీ ఇన్​­చా­ర్జి మీ­నా­క్షి నట­రా­జ­న్​­కూ­డా ఏకాం­తం­గా మా­ట్లా­డి వి­వ­రణ తీ­సు­కుం­ది. సు­రేఖ వ్యా­ఖ్య­లు పా­ర్టీ ఇమే­జ్‌­ను దె­బ్బ­తీ­స్తు­న్నా­య­ని, జా­తీయ స్థా­యి­లో చర్చ­నీ­యాం­శం­గా మా­రా­య­ని వి­శ్లే­ష­కు­లు పే­ర్కొం­టు­న్నా­రు. ఈ పరి­స్థి­తు­ల్లో ఆమె­ను మం­త్రి వర్గం నుం­చి తొ­ల­గిం­చే అవ­కా­శం ఉం­ద­ని ఊహా­గా­నా­లు సా­గా­యి. సో­ష­ల్ మీ­డి­యా­లో కొం­డా సు­రే­ఖ­ను పదవి నుం­చి తప్పిం­చా­ల­ని రే­వం­త్ రె­డ్డి ని­ర్ణ­యిం­చా­ర­నే ప్ర­చా­రం జరి­గిం­ది. 2024 అక్టో­బ­ర్‌­లో హీరో నా­గా­ర్జున కు­టుం­బం­పై వ్యా­ఖ్య­లు చే­సిన సం­ద­ర్భం­లో ఆమె­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు వచ్చా­యి. ఈ ఘటన తర్వాత అధి­ష్ఠా­నం సీ­రి­య­స్‌­గా స్పం­దిం­చి­న­ట్లు సమా­చా­రం. సు­రేఖ వ్య­వ­హా­ర­శై­లి పా­ర్టీ­కి నష్టం కలి­గి­స్తోం­ద­ని, రే­వం­త్ రె­డ్డి ఆమె­ను సమ­ర్థిం­చ­డం కష్ట­మ­వు­తోం­ద­ని వి­శ్లే­ష­కు­లు అం­టు­న్నా­రు. మం­త్రి వర్గ వి­స్త­రణ సం­ద­ర్భం­గా ఆమె స్థా­నం­లో మరొ­క­రి­ని ని­య­మిం­చే అవ­కా­శం ఉం­ద­ని ఊహా­గా­నా­లు సా­గా­యి. కొం­డా సు­రేఖ రా­జ­కీయ నే­ప­థ్యం, ఆమె పా­ర్టీ­లో బలం కూడా ఈ వి­ష­యం­లో కీ­ల­కం. భద్రకాళి ఆలయ వివాదం నుంచి మొదలుకొని, తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

నా భార్య పదవికి ఢోకా లేదు: మురళీ

వరం­గ­ల్ రా­జ­కీ­యా­ల్లో ఆమె గణ­నీ­య­మైన ప్ర­భా­వం కలి­గి ఉంది. బీసీ నా­య­కు­రా­లి­గా ఆమె­కు గట్టి మద్ద­తు ఉంది. ఈ నే­ప­థ్యం­లో ఆమె­ను తొ­ల­గి­స్తే పా­ర్టీ­కి నష్టం జరు­గు­తుం­ద­నే ఆలో­చన రే­వం­త్ రె­డ్డి­ని ఆగి ఆలో­చిం­చే­లా చే­స్తోం­ది. అయి­తే, వరుస వి­వా­దా­లు పా­ర్టీ ఇమే­జ్‌­ను దె­బ్బ­తీ­స్తు­న్నా­య­నే వాదన కూడా బలం­గా వి­ని­పి­స్తోం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే సు­రేఖ భర్త కొం­డా ము­ర­ళి ‘నా భా­ర్య­కు ఏమీ ఢోకా లేదు’ అని చె­ప్పా­డు.

భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదు

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "భద్రకాళి ఆలయం ఎవరి సొంత ఆస్తి కాదు. కానీ కొందరు అది తమదే అన్నట్లుగా భావిస్తున్నారు" అంటూ నాయినిని ఉద్దేశించి విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అయితే అక్కడ జంతుబలులు ఇస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. "అమ్మవారు శాకాహారి అనే విషయం అందరికీ తెలుసు. ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న అర్చకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం" అని సురేఖ స్పష్టం చేశారు.

Tags

Next Story