AP : వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు : మంత్రి తలసాని

AP : వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు : మంత్రి తలసాని
కేసీఆర్ టార్గెట్‌గా మోదీ విమర్శలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు

వందే భారత్ రైలును ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. కేసీఆర్ టార్గెట్‌గా మోదీ విమర్శలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని అధికారిక కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం దారుణమన్నారు. కేంద్రం ఏం అభివృద్ధి చేస్తే తాము అడ్డుకున్నామని ప్రశ్నించారు. తెలంగాణ గురించి ప్రధానికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అదానీ స్కాంపై జేపీసీ వేయాలని విపక్షాలు ఆందోళన చేసినా పట్టడం లేదని ఆరోపించారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అక్కడి ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టంచేశారు. తెలంగాణలో అభివృద్ధిపై మోదీ చర్చకు రావాలని మంత్రి తలసాని సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story