శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆర్మీ జవాన్‌ పరుశురామ్ భౌతికకాయం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆర్మీ జవాన్‌ పరుశురామ్ భౌతికకాయం

శ్రీనగర్‌ నుంచి ఆర్మీ జవాన్‌ పరుశురామ్ భౌతికకాయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరింది. ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఆర్మీ అధికారులు... ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని విమానాశ్రయం నుంచి.. మహబూబ్‌నగర్‌ జిల్లా గండ్వీడ్‌ మండలంలోని స్వగ్రామానికి తరిలించారు. దేశ సేవలో అమరుడైన పరుశురామ్‌ కుటుంబానికి రూ. 25 లక్షలతో పాటు డబుల్‌ బెడ్‌ రూంలు ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. భవిష్యత్‌లో పరుశురామ్‌ కుటుంబానికి.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story