Hyderabad: ఆటోడ్రైవర్ బీభత్సం.. ఇద్దరు మహిళల పై విచక్షణారహితంగా

X
By - TV5 Digital Team |16 April 2022 9:45 PM IST
Hyderabad: నగరంలో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు మితి మీరుతున్నాయి. మహిళలని చూడకుండా ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ ఆటోడ్రైవర్.
Hyderabad: నగరంలో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు మితి మీరుతున్నాయి. మహిళలని చూడకుండా ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ ఆటోడ్రైవర్. నడిరోడ్డుపై మహిళలను కొడుతూ బీభత్సం సృష్టించాడు.
అడ్డువచ్చిన వారిపై కూడా దాడికి యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని హైదర్గూడలో చోటు చేసుకుంది. మహిళలు వెళుతున్న మోటార్ సైకిల్కు ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దీంతో వారు చూసి నడపండి అన్నపాపానికి ...ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు.
వారిని బూతులు తిడుతూ ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. చంటిపాపను ఎత్తుకున్న మహిళపై కూడా దాడికి చేశాడు. నడిరోడ్డుపై కొద్దిసేపు వీరంగం సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నంచేసిన వారిపై కూడా దాడికి యత్నించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com