Dubbaka : అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం

సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్ర్తాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు అర్డర్ను అందుకున్నారు. దుబ్బాకలో ఏర్పాటైన దుబ్బాక హైండ్ల్యూస్ కంపెనీలో తయారైన లినెన్ ఇక్కత్ చేనేత వస్ర్తాన్ని (పింక్ కలర్) అయోధ్య రాముడికి ఆదివారం అలంకరించారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపారు. అయోధ్య రాముడి అలంకరణకు తాము తయారు చేస్తున్న లినెన్ వస్ర్తాలు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్ర్తాలను రాముడికి అలంకరించేందుకు ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీశ్త్రిపాఠి ఎంపిక చేస్తారని ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లినెన్ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్ లినెన్ ఇక్కత్ వస్రాలను అందించడం జరిగిందన్నారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com