శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు.. నాలుగు నెలల తర్వాత బిడ్డ కావాలంటూ..

శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు.. నాలుగు నెలల తర్వాత బిడ్డ కావాలంటూ..
X

కుటుంబ పోషణ భారంగా ఉందని తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా పసిబిడ్డను అమ్మేశారు. అయితే.. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ తనకు కావాలంటూ ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్‌ నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మీనా, వెంకటేష్‌ అనే దంపతులకు జూలై 19న పిల్లాడు పుట్టాడు. అనంతరం వేరొకరికి ఆ చిన్నారిని అమ్మేశారు. అయితే.. ఆ సమయంలో ఆడపిల్ల అని చెప్పి.. మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాబును చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించారు.


Tags

Next Story