Revanth Reddy: రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు..

X
By - Divya Reddy |17 March 2022 10:22 AM IST
Revanth Reddy: ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
Revanth Reddy: రాచకొండ కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ఫిర్యాదు చేశారు. భారతమాతపై రేవంత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశగౌరవాన్ని కించపరిచేలా భారతమాతపై ఎంపీ రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని భజరంగ్దళ్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భజరంగదళ్ కార్యకర్తలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com