Bandi Arrest : పేపర్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాక, లీకేజీ ఎలా అవుతుంది ..? : హైకోర్టు

Bandi Arrest : పేపర్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాక, లీకేజీ ఎలా అవుతుంది ..? : హైకోర్టు
బెయిల్ పిటిషన్‌ వేసుకోవచ్చన్న హైకోర్టు... తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. పేపర్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాక.. లీకేజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది హైకోర్టు. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మూడ్రోజులు సెలవులు ఉన్నాయని బండి సంజయ్‌ తరపున న్యాయవాది... హైకోర్టుకు విన్నవించారు. దీంతో బెయిల్ పిటిషన్‌ వేసుకోవచ్చన్న హైకోర్టు... తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


Tags

Read MoreRead Less
Next Story