హుజూరాబాద్ ఎన్నిక కోసమే సీఎం అఖిలపక్ష సమావేశం: బండిసంజయ్

X
By - TV5 Digital Team |27 Jun 2021 5:53 PM IST
హుజూరాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు.
హుజూరాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండిసంజయ్.. కోనరావుపేట మండలం బావుసాయిపేటలో అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పరామార్శించారు. అఖిలపక్ష సమావేశానికి సీఎం కేసీఆర్... తనకు అనుకూలమైనవారిని పిలిచి....ప్రశ్నించేవారిని పక్కపెట్టినట్లు బండిసంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా ...సీఎం మొసలు కన్నీరు కారుస్తున్నారని బండిసంజయ్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com