జీతాలు ఇవ్వలేని సీఎం... దళిత బంధు ఇస్తారా?: బండి సంజయ్
By - /TV5 Digital Team |22 Aug 2021 9:59 AM GMT
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించలేదని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించలేదని మండిపడ్డారు. గడీలు ఎప్పుడు బద్దలవుతాయో అని కేసీఆర్కు భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు... భరోసా ఇచ్చేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. కరోనా సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు సేవ చేశారని, సీఎం, మంత్రులు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వలేని సీఎం... దళిత బంధు ఇస్తారా? అని అన్నారు. 2023లో గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరేస్తామని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తంచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com