ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ డిస్కౌంట్‌లో కొన్నారు : బండిసంజయ్

ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ డిస్కౌంట్‌లో కొన్నారు : బండిసంజయ్
ఇందిరా పార్కు ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ 80శాతం డిస్కౌంట్‌లోకొన్నాడని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

ఇందిరా పార్కు ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ 80శాతం డిస్కౌంట్‌లోకొన్నాడని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కామారెడ్డిజిల్లాలో ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచితే బీజేపీ సత్తా చూపిస్తామన్నారు. పేదోళ్లపై ప్రేమ ఉంటే రాష్ట్రప్రభుత్వం పెట్రోల్‌పై తీసుకుంటున్న 40 రూపాయలను తగ్గించాలన్నారు. ఆర్టీసి కార్మికుల ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని ...వారి కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జీడీపీలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని సూటిగా ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story