కేసీఆర్పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు..!

X
By - prasanna |15 March 2021 9:45 PM IST
భైంసాలో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నా... ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడిలో గాయపడ్డవారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భైంసాలో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నా... ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడిలో గాయపడ్డవారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హిందూ వాహిని కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం ఎంఐఎం చేతుల్లో పెట్టిందని విమర్శించారు. భైంసాలో నాలుగేళ్ల పాపపై అత్యాచారం జరిగితే ఏ పార్టీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 12 ఇళ్లు దగ్ధమైనా కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com