Bandi sanjay : సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

Bandi sanjay : వడ్ల కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్కు మరోసారి లేఖ రాశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజ కొంటామని ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావస్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలు తెలుసుకుని... వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో రైతులు తమ కష్టాలు చెప్పుకుంటున్నారని... గద్వాలలో 71 కేంద్రాలకు గానూ.. కేవలం రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... కేవలం రెండు వేల 5 వందల కేంద్రాలు మాత్రమే ప్రారంభించడం దారుణమన్నారు. 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా... 2 లక్షల టన్నులు మాత్రమే కొనడం బట్టీ రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com