Bandi Sanjay : ముగింపుకొచ్చిన బండి సంజయ్ పాదయాత్ర..
Bandi Sanjay : తెలంగాణలో రాజకీయాలు పీక్ స్టేజ్కు వెళ్లాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ధర్నాలు, నిరసనలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ ఎపిసోడ్ హైఓల్టేజ్ను తలపిస్తున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు బ్రేకులు వేయడం, పంచాయితీ హైకోర్టుకు చేరిన వేళ.. ఆయన యాత్ర ముగింపు సభపై ఉత్కంఠ రేపుతోంది. అయితే పాదయాత్ర ముగింపు సభపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. యథాతథంగా ఈనెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బీజేపీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్.. ఆరు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. వరంగల్ సభా ఏర్పాట్లు, జన సమీకరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ సభకు ధీటుగా వరంగల్ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. సభకు రెండు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వరంగల్ సభలో భారీ చేరికలకు ప్లాన్ చేస్తున్న కమలం పార్టీ..ప్రదీప్రావు, రాజయ్య యాదవ్, మురళీ యాదవ్, బొమ్మ శ్రీరాంతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com