Bandi Sanjay: రాష్ట్రానికి 24 గంటల ఉచిత విద్యుత్లో పెద్దఎత్తున అవినీతి: బండి సంజయ్

X
By - Divya Reddy |30 May 2022 6:30 PM IST
Bandi Sanjay: 24 గంటల ఉచిత విద్యుత్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay: రాష్ట్రానికి 24 గంటల ఉచిత విద్యుత్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. డిస్కంలను నిర్విర్యం చేసేలా కేసీఆర్ సర్కార్ చర్యలున్నాయని మండిపడ్డారు. డిస్కంలు 60 వేల కోట్లమేర నష్టాలు మూటగట్టుకోవటానికి.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు బండి సంజయ్.
40 గ్రామాలకు అందించే విద్యుత్ను సీఎం కేసీఆర్ ఉచితంగా తన ఫాంహౌస్కు తరలిస్తున్నారని..ఇందుకు ఏకంగా ప్రత్యేక లైన్ వేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన 17వేల కోట్ల బకాయిల్లో.. ఒక్కరూపాయి చెల్లించకుండా విద్యుత్ రంగాన్నినష్టాలఊబిలోకి నెట్టేస్తున్నారని బండిసంజయ్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com