Bandi Sanjay: భగవద్గీతను కించపరిస్తే తగిన శాస్తి చేస్తాం: బండి సంజయ్
By - Divya Reddy |18 Aug 2022 1:30 PM GMT
Bandi Sanjay: భగవద్గీతను కించపరిస్తే తగిన శాస్తి చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay: భగవద్గీతను కించపరిస్తే తగిన శాస్తి చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వైకుంఠ ధామాల రథాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలో హిందువుల ఓటు బ్యాంకును ఏకం చేయడం ద్వారా హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామన్నారు బండి సంజయ్. పాదయాత్ర ప్రారంభానికి ముందు బ్రాహ్మణ ప్రతినిధులు బండి సంజయ్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. హిందూమతంపై జరుగుతున్న దాడులను బండి సంజయ్కు వివరించారు. బ్రాహ్మణులలతో కడు పేదలకు ఉన్నారని, కనీసం వెయ్యి కోట్లతో బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com