Bandi Sanjay : ఉత్సవాలను అడ్డుకుంటే.. ప్రగతి భవన్లో నిమజ్జనం చేస్తాం : బండి సంజయ్

Bandi Sanjay : గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల పేరుతో ఉత్సవాలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అడ్డుకుంటే.. వినాయకుడి నిమజ్జనం ప్రగతి భవన్ లో చేస్తామంటూ హెచ్చరించారు.
శాంతి భద్రతల అంశం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంలో సీఎస్ సోమేష్ కుమార్ నెంబర్ వన్ అంటూ ఫైర్ అయ్యారు . నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. లౌడ్ స్పీకర్లపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.
మరోవైపు ఉపాధ్యాయుల దినోత్సవం రోజు కూడా టీచర్స్ ను గౌరవించే ఆలోచన సీఎం కేసీఆర్కు లేదని బండి సంజయ్ అన్నారు.ఆంక్షలతో విద్యార్థులకు ఏ మేస్సేజ్ ఇస్తారని అన్నారు బండి సంజయ్. ఇదేనా ఉపాధ్యాయులపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన టీచర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com