Bathukamma : తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
Bathukamma : తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ భవన్ పూలసింగిడిగా మారింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేశారు. అదేవిధంగా బతుకమ్మ సంబరాల్లో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ సుధారాణి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం బతుకమ్మ దగ్గర ఉత్సాహంగా పాటపాడారు. కవిత పాటకు పలువురు మహిళలు స్టేప్పులు వేశారు. దీంతో టీఆర్ఎస్ భవన్ సందడిగా మారింది. అటు పద్మాదేవేందర్ రెడ్డి కూడా పాటపాడి ఆడారు. జై తెలంగాణ నినాదాలతో టీఆర్ఎస్ భవన్ మారుమ్రోగింది. ఇక పెద్దసంఖ్యలో హాజరైన టీఆర్ఎస్ మహిళా విభాగం బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com