పీపుల్స్ మార్చ్లో భట్టి పుట్టిన రోజు వేడుకలు
By - Subba Reddy |15 Jun 2023 7:30 AM GMT
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లగొండ జిల్లా చెన్నారంలో బస చేసిన శిబిరం వద్దే రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను భారీగా ఏర్పాటు చేశారు. తన కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో భట్టి కేక్ కట్ చేసారు. అనంతరం జై సోనియాగాంధీ, జైజై కాంగ్రెస్ నినాదాలతో పాదయాత్ర శిబిరం హోరెత్తింది. చల్లా నరసింహారెడ్డి ప్రత్యేకంగా భట్టి విక్రమార్క ఫొటోతో తయారు చేయించిన కేక్ ఆకట్టుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com