BHATTI: తెలంగాణ హోంమంత్రిగా భట్టి..?

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మంత్రుల శాఖల కేటాయింపుపై విస్తృత చర్చ జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, బొల్లం వివేక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా ఇప్పటివరకూ శాఖల కేటాయింపు జరగలేదు. వీరికి శాఖల కేటాయిపుతోపాటు ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేస్తారన్న ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఈ మార్పులు కేవలం పరిపాలనా పరంగా మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడ పార్టీకి కీలకమైన సంకేతాలను ఇస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముమ్మర కసరత్తు..?
ఇంకా కొత్త మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించలేదు. మామూలుగా అయితే ఎప్పుడు క్యాబినెట్ ప్రమాణస్వీకారం జరిగిన నాడు సాయంత్రంలోపే మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎంవో నుంచి ప్రకటన వస్తుంది. కానీ ముగ్గురు మంత్రులకు శాఖల అలాట్మెంట్పై మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మంత్రులకు శాఖల కేటాయింపు కోసం సీఎం రేవంత్రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. ఫలాన శాఖే కావాలని మంత్రులు పట్టుబడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన దగ్గర ఉన్న శాఖలను ఎవరికీ ఇచ్చేందుకు ఇష్టపడట్లేదట. దీంతో శాఖల కేటాయింపు పంచాయతీ ఢిల్లీకి చేరుకుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
కేసీ వేణుగోపాల్తో చర్చలు
తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో సుమారు గంటపాటు చర్చించారు. పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాను ఆయనకు అందించినట్లు తెలిసింది. కొత్తవారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా... పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి వీరికివ్వాలా... అన్న విషయమై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రుల చేతుల్లో దాదాపు 29 శాఖలున్నాయి. కీలకమైన మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీఎం తనవద్దే ఉంచుకున్నారు. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయబోరని కూడా అంటున్నారు.
హోంమంత్రిగా భట్టీ..?
మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదికతో ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంత మందికి రెండు మూడు శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరూ సమర్థవంతంగా పని చేస్తున్నారు ఎవరెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ఇతర ముఖ్యమైన కేసులు కీలక దశలో ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రుల ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖను అప్పగించకుండా అనుభవం కలిగిన భట్టి విక్రమార్కకు అప్పగించే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ కు విద్యా శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోం శాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండగా మంత్రుల శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోగా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ప్రాధాన్యం కొనసాగించాలనే విషయంపైనా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com