BJP : చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి..లేకుంటే గద్దెదిగు.. ఢిల్లీలో బీజేపీ ప్లెక్సీలు..
By - TV5 Digital Team |11 April 2022 4:30 AM GMT
BJP : వరిధాన్యం కొనుగోలు వివాదం ఢిల్లీకి చేరింది. వరిని కొనుగోలు చేయాలంటూ హస్తినలో టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది.
BJP : వరిధాన్యం కొనుగోలు వివాదం ఢిల్లీకి చేరింది. వరిని కొనుగోలు చేయాలంటూ హస్తినలో టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. దీనిలో భాగంగా భారీగా ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేసింది. అయితే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ... తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా కటౌట్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ తెలంగాణ రైతులను గాలికి వదిలేసి ఢిల్లీలో డ్రామాలా అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి...లేకపోతే గద్దె దిగు అంటూ ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఫోటోతో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఢిల్లీవీధుల్లో ప్లెక్సీలు వెలిశాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com