RAJASINGH: కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టే: రాజాసింగ్

ప్రధాని మోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏటీఎంలాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయట పెట్టగానే గులాబీ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టేనని ఆయన ఆరోపించారు. అందులో బీజేపీది, తమ నేతలది ఒకే అభిప్రాయమని రాజాసింగ్ స్పష్టం చేశారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లు పెంచలేదా అని నిలదీశారు. ఆనాడు స్వయం ప్రకటిత ఇంజనీర్గా అవతారం ఎత్తి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేపడితే.. ఈనాడు కేటీఆర్ ఎన్డీఎస్ఏ కంటే తానే తెలివైన మేధావిగా ప్రవర్తించడం సిగ్గుచేటని రాజాసింగ్ విమర్శించారు. బండి సంజయ్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ నేతల ఓటమికి నిదర్శనమని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com