KTR: రేవంత్ నన్నేమీ పీకలేరు: కేటీఆర్

నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటాను. రేవంత్ రెడ్డి నన్నేమీ పీకలేరు' అంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో భాగంగా సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఈ కార్ రేసింగ్పై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. రేవంత్ పారిపోయారు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా రెడీ అని చెప్పినా పత్తాలేరు. ఇదో లొట్టపీసు కేసు. విచారణలో పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏమీ లేవు.ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారు. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు అడిగారు. రేవంత్ జైలుకెళ్లారు.. మమ్మల్నీ జైల్లోపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. వందల కొద్దీ కేసులు పెట్టినా.. జైల్లో పెట్టినా భయపడను’అని కేటీఆర్ అన్నారు.
సోమవారం ఏసీబీ అధికారులు కేటీఆర్ ను 7 గంటల పాటు ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నలు వేశారు. విచారణ సందర్భంగా అధికారులు 60కి పైగా ప్రశ్నల్ని అడిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ సెల్ఫోన్ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ-రేసు సమయంలో వాడిన సెల్ఫోన్లను అప్పగించాలని కేటీఆర్ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18లోపు సెల్ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com