BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభం

BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభం
X
ఉదయం 7 నుంచి 6 వరకు పోలింగ్... పోలీసు భద్రతా వలయంలో జూబ్లీహిల్స్.. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు

రెం­డు తె­లు­గు రా­ష్ట్రా­ల్లో ఉత్కంఠ రే­కె­త్తి­స్తు­న్న జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్నిక పో­లిం­గ్ ఆరంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సా­యం­త్రం 6 గంటల వరకు జర­గ­నుం­ది. సా­యం­త్రం ఆరు గంటల కల్లా పో­లిం­గ్‌ స్టే­ష­న్‌ ఆవ­ర­ణ­లో­కి వచ్చిన ప్ర­తి ఒక ఓటరూ ఓటు­ను వి­ని­యో­గిం­చు­కో­ను­న్నా­రు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టి­నా, అం­ద­రూ ఓట్లు వే­సిన తర్వా­తే పో­లిం­గ్‌ ప్ర­క్రియ ము­గిం­చి, ఈవీ­ఎం­ల­ను ఏజెం­ట్ల సమ­క్షం­లో సీ­జ్‌ చేసి, రి­సె­ప్ష­న్‌ అం­డ్‌ డి­స్ట్రి­బ్యూ­ష­న్‌ సెం­ట­ర్‌­కు తర­లిం­చ­ను­న్నా­రు. ఉప ఎన్నిక, జన­ర­ల్‌ ఎల­క్ష­న్స్‌ జరి­గే ని­యో­జ­క­వ­ర్గా­ల్లో­ని ఓట­ర్లు తమ ఓటు­ను సద్వి­ని­యో­గం చే­సు­కు­నేం­దు­కు వీ­లు­గా పో­లిం­గ్‌ రో­జున ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­ల­కు సె­ల­వు ది­నం­గా ప్ర­క­టించారు. ప్రై­వే­టు సం­స్థ­లు కూడా ఉద్యో­గు­ల­కు సె­ల­వు ప్ర­క­టిం­చా­ల­ని ఎన్ని­కల సంఘం సూ­చిం­చిం­ది. గంట పాటు పో­లిం­గ్‌ సమ­యా­న్ని పెం­చ­డం పై పో­లిం­గ్‌ శాతం గతం­లో కంటే పె­రి­గే అవ­కా­శా­లు­న్నా­య­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు 14న వెలువడనున్నాయి. మొ­త్తం 58 మంది అభ్య­ర్థు­లు రం­గం­లో ఉం­డ­గా ప్ర­ధా­నం­గా బీ­ఆ­ర్ఎ­స్‌, కాం­గ్రె­స్, బీ­జే­పీల మధ్య పోటీ నె­ల­కొం­ది.

బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్‌ మృ­తి­తో ఉప ఎన్నిక అని­వా­ర్య­మైం­ది. ఆయన భా­ర్య మా­గం­టి సు­నీత పోటీ చే­స్తుం­డ­గా.. అధి­కార కాం­గ్రె­స్‌ నుం­చి నవీ­న్‌­యా­ద­వ్, బీ­జే­పీ నుం­చి లంకల దీ­ప­క్‌­రె­డ్డి బరి­లో ఉన్నా­రు. మూడు పా­ర్టీ­లూ ఈ ఎన్ని­క­ను ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కు­న్నా­యి. 58 మంది అభ్య­ర్థుల భవి­త­వ్యా­న్ని 4,01,365 మంది ఓట­ర్లు తే­ల్చ­ను­న్నా­రు. ఉపఎ­న్నిక కోసం 407 పో­లిం­గ్‌ కేం­ద్రా­ల­ను అధి­కా­రు­లు ఏర్పా­టు చే­శా­రు. ఇం­దు­లో 226 కేం­ద్రా­ల­ను సమ­స్యా­త్మ­క­మై­న­వి­గా గు­ర్తిం­చా­రు. రెం­డం­చెల భద్ర­త­ను ఏర్పా­టు చే­శా­రు. 139 డ్రో­న్ల­తో పటి­ష్ట­మైన నిఘా ఏర్పా­టు చే­శా­రు. ఇప్ప­టి­కే జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో 144 సె­క్ష­న్ అమ­ల్లో­కి వచ్చిం­ది. 1761 మంది పో­లీ­సు­లు, కేం­ద్ర బల­గా­ల­ను ఎన్ని­కల సంఘం రం­గం­లో­కి దిం­పిం­ది. పో­లిం­గ్‌ కేం­ద్రా­ల్లో పని­చే­య­ను­న్న 2,060 మంది పీఓ, ఏపీఓ, ఓపీ­ల­కు పో­లిం­గ్‌ కేం­ద్రాల కే­టా­యిం­పు జరి­గిం­ది. ఓట్ల లె­క్కిం­పు కేం­ద్రం యూ­సు­ఫ్‌­గూడ కో­ట్ల వి­జ­య­వి­జ­య­భా­స్క­ర్‌­రె­డ్డి స్టే­డి­యం వద్ద సీ­ఐ­ఎ­స్‌­ఎ­ఫ్‌ దళా­లు వె­లు­పల, లోపల బె­టా­లి­య­న్‌ పో­లీ­సు­లు, స్థా­నిక పో­లీ­సు­లు మూ­డం­చె­ల్లో భద్రత కల్పి­స్తా­మ­ని జా­యిం­ట్‌ సీపీ తె­లి­పా­రు.

Tags

Next Story