ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

యాసంగిలో నిర్ణీత పంట సాగు, ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. కేబినెట్ తీర్మానాల్ని బిల్లు రూపంలో ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే... జీహెచ్‌ఎంసీ చట్టంలో మార్పులపైనా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story