కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే : ఎంపీ రేవంత్ రెడ్డి

X
By - TV5 Digital Team |16 Feb 2021 9:45 PM IST
రేవంత్ చేపట్టిన రాజీవ్ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రేవంత్ చేపట్టిన రాజీవ్ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం వెళ్తే రైతుల పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందని రేవంత్ మండిపడ్డారు. సాగు చట్టాలు అమల్లోకి వస్తే.. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా రాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com