హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు..!

X
By - TV5 Digital Team |20 April 2021 3:15 PM IST
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. రాత్రి 7.45కు చివరి మెట్రో రైలు బయల్దేరనుంది.
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. రాత్రి 7.45కు చివరి మెట్రో రైలు బయల్దేరనుంది. చివరి స్టేషన్కు ఆ రైలు 8.45కు చేరుకోనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయి. అయితే.. ఉదయం ఆరున్నర నుంచి యథావిధిగానే మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని మెట్రో అధికారులు కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com