దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి?

X
By - kasi |5 Oct 2020 12:22 PM IST
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే నర్సారెడ్డి పేరు ఖారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో నర్సారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. చివరి క్షణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా చెరుకు శ్రీనివాస్రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ గాంధీభవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం భేటీ కానున్నారు. దీంతో నర్సారెడ్డి హుటాహుటిన గాంధీభవన్కు చేరుకుంటున్నారు. చెరుకు శ్రీనివాస్రెడ్డి విషయంలో..... దామోదర రాజనరసింహ తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com