డోర్నకల్‌ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గవిభేదాలు

డోర్నకల్‌ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గవిభేదాలు
X
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే కోపంగా సమాధానమిచ్చారు. పెద్దోళ్ల పక్కన తిరుగుతున్నావు.. వాళ్లే చేస్తారని సభాముఖంగా చెప్పారు రెడ్యానాయక్.

డోర్నకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి అనుచరుడికి పనులు చేయబోయనంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సభాముఖంగా ప్రకటించడం గులాబీ పార్టీలో కలకలం రేపుతుంది. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం మూల మర్రితండాకు వచ్చిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ను సర్పంచ్‌ కుమారుడు కలిశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే కోపంగా సమాధానమిచ్చారు. పెద్దోళ్ల పక్కన తిరుగుతున్నావు.. వాళ్లే చేస్తారని సభాముఖంగా చెప్పారు రెడ్యానాయక్.

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వర్గాలను పెంచి పోషిస్తున్నారని మూలమర్రి తండా సర్పంచ్‌ తనయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అనుచరుడన్న కారణంతో 40 లక్షల బిల్లులు పెండింగ్‌లో పెట్టించారని.. తన తల్లి సర్పంచ్‌గా ఉన్నప్పటికి కనీసం ప్రోటోకాల్‌ పాటించడం లేదని వాపోయాడు. తమ సమస్యల పరిష్కారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు రావొద్దన్న మీరు.. తమ గ్రామానికి ఎలా వస్తారంటూ సర్పంచ్‌ తనయుడు ఎమ్మెల్యేను నిలదీశారు.

Tags

Next Story