సిద్దిపేటలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ

X
By - kasi |2 Nov 2020 9:33 PM IST
సిద్దిపేట పట్టణంలో TRS, BJP వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ ఎస్ నేతలు బస చేస్తున్న స్వర్ణప్యాలెస్ వద్దకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు..
సిద్దిపేట పట్టణంలో TRS, BJP వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ ఎస్ నేతలు బస చేస్తున్న స్వర్ణప్యాలెస్ వద్దకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్యాలెస్ను తనిఖీచేసేందుకు ఎమ్మెల్యే క్రాంతి, వీరేశం ఉన్న గదిలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని టీఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com