సీఎం కేసీఆర్, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు..!

X
By - TV5 Digital Team |23 Jun 2021 5:40 PM IST
సీఎం కేసీఆర్, మంత్రులు... నీళ్ల యుద్ధం చేస్తున్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
సీఎం కేసీఆర్, మంత్రులు... నీళ్ల యుద్ధం చేస్తున్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సంగమేశ్వర్ ప్రాజెక్టుకు ఏపీ సర్కారు ఏడాది క్రితం జీవో ఇచ్చిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలు ఏడాది తర్వాత మేలుకున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అక్రమంగా నీరు తీసుకుపోతోందని చెబితే కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. రాయలసీమ ఎత్తివేతలపై టెండర్లు పిలవకముందే చెప్పినా... ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఊర్లలో తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com