టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

X
By - TV5 Digital Team |26 March 2021 5:42 PM IST
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 30 రోజులు నడవాల్సిన బడ్జెట్ సమావేశాలు ఆరు రోజులే నడిపారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 30 రోజులు నడవాల్సిన బడ్జెట్ సమావేశాలు ఆరు రోజులే నడిపారని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల కుదింపును తప్పుబట్టిన ఆయన.. కేసీఆర్ పాలన నిరంకుశంగా ఉందని ఆరోపించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో మొండిచేయి ఇచ్చారని.. ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపులు జరగలేదన్నారు. పక్క రాష్ట్రం నీటి దోపిడీకి పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న భట్టి విక్రమార్క.. రాష్ట్ర సొమ్మును కాంట్రాక్టులకే దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com