సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం కేసీఆర్!

X
By - TV5 Digital Team |21 Jan 2021 9:45 PM IST
పది లక్షల ఎకరాల సాగునీరు అందించే ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పది లక్షల ఎకరాల సాగునీరు అందించే ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడు ఉంటాయో తెలియదని, గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయుకట్టకు నీరు అందించాలన్నారు. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టును నిర్మించి.. పాలేరు, రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com