తెలంగాణలో మరో కొత్త మండలం.. సీఎం గ్రీన్ సిగ్నల్!

X
By - Admin |22 Dec 2020 5:51 PM IST
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వినతి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు కలిపి మొత్తం 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన మండల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com