ఇవాళ కాళేశ్వరంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని? ఎగువ నుంచి ఎంత నీరు వస్తున్నది? రోజుకు ఎన్ని టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చు? వేసవికాలంలో కూడా రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. లక్ష్మీ బరాజ్ను సందర్శించి పరిస్థితిని అంచనావేస్తారు.
ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం వెళ్తారు. ముందుగా కాళేశ్వర, ముక్తీశ్వర దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. బరాజ్ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివస్తారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ఆలయం, లక్ష్మీబరాజ్ దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్ష్మీబరాజ్ వద్ద సుమారు 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com